Online: దేశంలో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ గేమింగ్ రంగాన్ని నియంత్రణలో ఉంచుతూ, ప్రజలకు నష్టాలు కలగకుండా చూసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) నేడు ఆన్లైన్ గేమింగ్ రంగ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ-స్టోర్స్ (ఇంటర్నెట్ ద్వారా ఆడే పోటీ గేమ్స్), స్నేహితులతో ఆడే సామాజిక గేమ్స్ (సోషల్ గేమ్స్) అభివృద్ధి గురించి ముఖ్యంగా చర్చించారు.

ఆన్లైన్ గేమ్స్ తో పాపులర్
ఇటీవల ఆన్లైన్ గేమ్స్(Online Games) విపరీతంగా పాపులర్ అవుతున్నారు. కొందరు వీటిలో డబ్బు పెట్టి ఆడుతూ నష్టపోతున్నారు. ఇతర మోసాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రంగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది. ఈ సమావేశంలో మూడు ప్రధాన విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆన్లైన్ గేమింగ్ను ఎలా సురక్షితంగా ఉంచాలి?, డబ్బు పెట్టి ఆడే వినియోగదారుల డబ్బు ఎలా కాపాడాలి?, గేమింగ్ కంపెనీలు భారతదేశ చట్టాలను ఎలా పాటిస్తున్నాయో సమీక్షించాలి? అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఉపాధి అవకాశాలెన్నో..
ఆన్లైన్ గేమింగ్ రంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఉపాధిని, ఆదాయాన్ని కలిగిస్తోంది. దీనిని సరైన మార్గంలో తీసుకెళ్లడం ద్వారా యువతకు మంచి అవకాశాలు అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆటలు ఆడడమే కాదు, వాటిని రూపొందించే టెక్నాలజీ రంగంలో కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇందులో వినియోగదారులు డబ్బు పెట్టి మరీ మోసాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎవరితో సమావేశమయ్యారు?
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం వృద్ధి, సవాళ్లు మరియు భవిష్యత్తు అవకాశాలపై చర్చించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :