రియల్ ఎస్టేట్ రంగంలో సన్టెక్ రియాల్టీ లిమిటెడ్ సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. కంపెనీ అత్యంత ఖరీదైన అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ల(Ultra luxury flats) అమ్మకానికి ప్రవేశిస్తోంది. ఒక్కో ఫ్లాట్ ₹100 కోట్ల నుంచి ₹500 కోట్ల మధ్య ధరలో విక్రయించబడనున్నట్లు ప్రకటించింది. గతంలో గురుగ్రామ్లో ₹100 కోట్ల ఫ్లాట్ అమ్ముడు వార్తగా మారింది, దాన్ని సన్టెక్ ఈసారి మించిపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎమాన్సే’ బ్రాండ్తో ముంబై, దుబాయ్లో ప్రత్యేక ప్రాజెక్టులు
ఈ ప్రాజెక్ట్ కోసం ‘ఎమాన్సే(‘Emanse’’) అనే ప్రత్యేక బ్రాండ్ పరిచయం చేశారు. ఈ బ్రాండ్ కింద ఇళ్లు అనుమతిచ్చిన వినియోగదారులకే (By Invite Only) అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. సన్టెక్ రియాల్టీ సిఎండీ కమల్ ఖేతన్ ప్రకారం, ఫ్లాట్ల కనీస ధర ₹100 కోట్లుగా, గరిష్టం ₹500 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
ప్రాజెక్టులను ముంబై, దుబాయ్లో నిర్మించనున్నారు. ముంబైలోని నీపెన్సీ రోడ్, దుబాయ్ డౌన్టౌన్ మరియు బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇది సన్టెక్ రియాల్టీకి తొలి విదేశీ ప్రాజెక్ట్. దుబాయ్ ప్రాజెక్ట్ పనులను 2026 జూన్ నాటికి ప్రారంభించే లక్ష్యం ఉంది. రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు ₹20,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు.
ఫ్లాట్ల చదరపు అడుగు నిర్మాణ వ్యయం ₹2.5 లక్షల పైగా ఉంటుందని అంచనా. ఇవి దేశంలో అత్యంత ఖరీదైన నివాస ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. సన్టెక్ రియాల్టీ 52.5 మిలియన్ చదరపు అడుగుల పోర్ట్ఫోలియోతో దేశంలోని అగ్రగామి రియల్టర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 47% పెరిగి ₹33.43 కోట్లుకి చేరగా, ఆదాయం ₹328 కోట్ల నుంచి ₹201 కోట్లకు తగ్గింది.
సన్టెక్ రియాల్టీ కొత్త అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ఖరీదు ఎంత?
ఫ్లాట్ల ధర ₹100 కోట్లు నుంచి ₹500 కోట్లు మధ్య ఉంటుంది.
ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి?
ముంబైలో నీపెన్సీ రోడ్, దుబాయ్ డౌన్టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో నిర్మించబడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: