స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుంది… మళ్లీ లాభాల్లోనే ముగింపు! దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) బుధవారం కూడా లాభాల బాటలో పయనించాయి. కీలక రంగాలైన బ్యాంకింగ్, ఐటీ, ఆటో విభాగాల్లో భారీగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు పాజిటివ్గా ముగిశాయి. అయితే విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అమెరికాతో జరుగుతున్న టారిఫ్ చర్చలు లాభాలను కొంత పరిమితం చేశాయి. రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313 పాయింట్లు ఎగసి 82,693.71 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 25,330.25 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) ఇంట్రాడేలో 82,741 గరిష్ఠాన్ని తాకింది.
రెలిగేర్ బ్రోకింగ్ అనలిస్ట్ అజిత్ మిశ్రా (Ajit Mishra) వ్యాఖ్యానిస్తూ, “మార్కెట్లు బుధవారం పరిమిత శ్రేణిలో కదలాడి, చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ, మొత్తం మీద సానుకూలత కనిపిస్తోంది. దేశీయ పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లకు మద్దతు ఇస్తుండగా, ఎఫ్ఐఐ (FII) అమ్మకాలు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలపై ఆందోళనలు లాభాలను కట్టడి చేశాయి” అని తెలిపారు.

Stock Market
రంగాల వారీగా
రంగాల వారీగా మిశ్రమ ఫలితాలు కనబడ్డాయి. (Stock Market) బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల్లో లాభాల స్వీకరణ కనిపించింది. కంపెనీ స్థాయిలో చూసినట్లయితే, ఎస్బీఐ, బీఈఎల్, మారుతీ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టపోయాయి.
బుధవారం స్టాక్ మార్కెట్ ఎలా ముగిసింది?
బీఎస్ఈ సెన్సెక్స్ 313 పాయింట్లు పెరిగి 82,693.71 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 25,330.25 వద్ద ముగిసింది.
లాభాలకు ప్రధాన కారణాలు ఏమిటి?
A2: బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం ప్రధాన కారణం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: