దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు జాగ్రత్త ధోరణితో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రారంభ గంటల్లోనే కీలక సూచీలు నష్టాల వైపు కదిలాయి. ఎర్లీ ట్రేడులో నిఫ్టీ సుమారు 38 పాయింట్లు తగ్గి 26,200 స్థాయిలో ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 60 పాయింట్ల వరకు పడిపోయి 85,379 వద్ద కొనసాగుతోంది.
Read also: Mahindra Cars: 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు

FMCG, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి
మార్కెట్లో(Sensex Today) ప్రధానంగా FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. డాబర్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ వంటి ప్రముఖ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తం మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, కొన్ని ఎంపిక రంగాలు, స్టాక్స్లో మాత్రం కొనుగోలు ఆసక్తి కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్స్, ICICI బ్యాంక్, టాటా స్టీల్ వంటి షేర్లు లాభాల వైపు కదులుతూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మిశ్రమ సంకేతాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం
గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలు(Sensex Today) లేకపోవడం, రంగాల వారీగా అమ్మకాలు–కొనుగోళ్లు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్ ధోరణి, కార్పొరేట్ వార్తలపై మార్కెట్ కదలికలు ఆధారపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: