हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు తెచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయం

Sharanya
బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు తెచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయం

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ మరోసారి కీలక చర్యలు చేపట్టింది. దేశీయ మార్కెట్‌లో లిక్విడిటీ పెరుగుతోందా లేదా? ఆర్థిక వ్యవస్థకు తగినంత నగదు అందుబాటులో ఉందా అనే విషయాలను సమీక్షించిన ఆర్బీఐ, మరింత స్థిరంగా బ్యాంకింగ్ వ్యవస్థకు నిధులు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు డాలర్-రూపాయి స్వాప్‌ వంటి చర్యల ద్వారా భారీగా నిధులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

rbi 103234646 16x9 0

రూ.1.9 లక్షల కోట్ల నిధులు

ఈ ప్రక్రియలో భాగంగా, మొత్తం రూ.1.9 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో రెండు ప్రధాన ఆర్థిక విధానాలను అమలు చేయనుంది. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు (OMO) ద్వారా సెక్యూరిటీ కొనుగోళ్లు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మొత్తం రూ.1 లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు చేపట్టనుంది. మార్చి 12, మార్చి 18 తేదీల్లో రూ.50,000 కోట్ల చొప్పున ఈ సెక్యూరిటీల కొనుగోలు చేయనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరిగేలా, క్రెడిట్ ఫ్లో మెరుగుపడేలా ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల డాలర్-రూపాయి స్వాప్ నిర్వహించిన ఆర్బీఐ, మరోసారి ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. మార్చి 24న మరో 10 బిలియన్ డాలర్ల స్వాప్ వేలాన్ని నిర్వహించనుంది. దీని ద్వారా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత నగదు ప్రవాహాన్ని పెంచే అవకాశం ఉంది.

ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

ఆర్బీఐ గవర్నర్ తాజాగా మాట్లాడుతూ, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లిక్విడిటీ పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కొంత నగదు ఒత్తిడి నెలకొన్నది. దీనిని తగ్గించేందుకు ఆర్బీఐ ముందుకొచ్చింది. లిక్విడిటీ పెరిగితే రుణాలపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి లేదా తగ్గే అవకాశం ఉంటుంది. మార్కెట్లో లిక్విడిటీ చౌకగా అందుబాటులో ఉంటే, స్టాక్ మార్కెట్ సహా ఇతర ఆర్థిక వ్యవస్థలు దృఢంగా కొనసాగే అవకాశముంది. ఈ చర్యల ద్వారా భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలపడే అవకాశముంది. బ్యాంకులకు తక్కువ రేట్లతో నిధులు అందుబాటులోకి రావడం, మార్కెట్ స్థిరత పెరగడం వంటి అంశాలు దీని ప్రభావిత ఫలితాలు. మొత్తానికి, దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా ఆర్బీఐ చేపట్టిన ఈ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870