हिन्दी | Epaper

Nominations Process: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ – టీపీసీసీ చీఫ్ మహేష్

Sudheer
Nominations Process: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ – టీపీసీసీ చీఫ్ మహేష్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల మధ్య, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ (Mahesh Kumar) స్పష్టతనిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుగుతున్నప్పటికీ, తమ న్యాయవాదులు ప్రభుత్వ తరఫున బలమైన వాదనలు వినిపించారని తెలిపారు. “రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోర్టు తీర్పు ఏదైనా వచ్చినా ప్రజాస్వామ్య ప్రక్రియ ఆగదు” అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

అదే సమయంలో.. బీసీ రిజర్వేషన్ల (BC Reservation) బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. “బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చట్టం రూపొందించాం. ఈ బిల్లుకు అసెంబ్లీలో ప్రతిపక్షాలూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. కోర్టులోనూ మాకు విజయమే దక్కుతుందని నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలోనే అన్ని చర్యలు చేపడుతోంది. బీసీ వర్గాల హక్కులను కాపాడటమే మా లక్ష్యం” అని ఆయన తెలిపారు.

Modi : కాంగ్రెస్ బలహీనతే టెర్రరిస్టులకు బలం – మోదీ

మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలతో మమేకమై పనిచేశాం. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,” అని ఆయన ధైర్యంగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపగా, రాజకీయ వాతావరణంలో కొత్త ఉత్కంఠను రేపాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870