హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ సోమవారం ఎఐసిసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే (Mallikarjun Kharge) పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీకి వెళ్లి నేరుగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలి పారు. అయితే ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్లో ఆసక్తిగా మారింది. ఖర్గే జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే టిపిసిసి వెళ్ళినప్పటికి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల దృష్టా మహేశ్ కుమార్ ఢిల్లీకి రప్పించు కొన్నారని పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల రాబోయే పదేళ్ళు నేనే సిఎంగా ఉంటానని అనడం పార్టీలోని కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతోన్నది. అదే జిల్లా నుంచి చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమశిక్షణా రాహిత్యం, స్థానిక సంస్థల వంటి అంశాలపై ఎఐసిసి పెద్దలతో మహేష్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చర్చించినట్లు తెలుస్తోంది. తెలం గాణలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కసరత్తు జరుగుతున్న ప్రస్తుత దానిని తరుణంలో టిపిసిసి అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. ఆర్డినెన్సు రూపంలో బిసి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ న్యాయసలహా కోసం పంపించారు. గవర్నర్ వద్ద ఏదైనా ఆటంకం ఏర్పడితే రాజకీయంగా బిసి 42 శాతం రిజర్వేషన్లు (BC 42 percent reservations) ఇచ్చేందుకు సిద్ధం అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) జన్మదిన శుభా కాంక్షలు తెలి పేందుకు ఢిల్లీ వెళ్ళిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమారులకు ఢిల్లీ ఎయిర్ పోర్టుల తెలంగాణ పిసిసిఆన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ విభాగం చైర్మన్ కౌశల్ సమీర్, టిపిసిసి ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్ పృథ్విరాజ్ నాయక్లు ఘనస్వాగతం పలికారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆధ్వర్యం లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మంతరావు బర్త్డే కేకు కట్చేసి ఆయన నిండునూరేళ్ళు ప్రజసేవలో ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఎఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ ఖర్గేను కలిసి శుభకాంక్షలు తెలిపారు. ఎఐసిసి కార్యదర్శి కెసివేణుగోపాల్, తెలంగాణ మంత్రులు వివేకెవెంకటస్వామి, ఎంపిలు కలిసి మల్లికార్జునఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagdeep Dhankhar resigns : ధనఖడ్ రాజీనామాకు కారణమేంటి?