భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా(Mahindra Cars) ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సృష్టించింది. 2025లో మహీంద్రా ఒకే సంవత్సరంలో 6,25,603 వాహనాలను అమ్మి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మారింది. ఈ రికార్డు రాబోయే కాలంలో కంపెనీపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇప్పటి వరకు ఈ స్థానం టాటా మోటార్స్ దగ్గర ఉండేది. కానీ మహీంద్రా టాటాను దాటిపోయి, మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచింది.
Read also: NikhilKamath: ఫోర్బ్స్ ’40 అండర్ 40’లో ఏకైక భారతీయుడు

2025 ప్రత్యేకతలు:
- అక్టోబర్ నెలలో 71,624 వాహనాలు అమ్మి మహీంద్రా కొత్త మైలురాయిని సాధించింది.
- మొత్తం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 97,000 యూనిట్ల పెరుగుదలను నమోదు చేశాయి.
ముఖ్య వాహనాలు:
- స్కార్పియో (N & క్లాసిక్): జనవరి–నవంబర్లో 1.61 లక్షల పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
- థార్ (3-డోర్ థార్ రాక్స్): యువతలో ఫేవరెట్, అమ్మకాలు 55% పెరిగాయి.
- XUV 3XO, బొలెరో: ఫ్యామిలీ, గ్రామీణ మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
- ఎలక్ట్రిక్ SUVలు (BE 6, XEV 9e): కొత్తగా వచ్చినా 38,841 యూనిట్లు విక్రయించబడినవి; మొత్తం అమ్మకాలలో 7% వాటా.
మహీంద్రా(Mahindra Cars) BE 6, XEV 9e ఎలక్ట్రిక్ SUVలతో భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది, యువత మరియు సాంకేతిక అభివృద్ధి కోరుకునే వినియోగదారులపై మంచి ప్రభావం చూపింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: