దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలతో గత రెండు సెషన్లు నష్టాలు చవిచూసిన సూచీలు.. నేడు మళ్లీ పుంజుకొన్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న మన మార్కెట్లు (Stock market) రాణించడం విశేషం. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చింది.
కీలక సూచీల ముగింపు స్థాయిలు
సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,034.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,118.60) నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే కోలుకున్న సూచీ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి సెన్సెక్స్ (Sensex) 677.55 పాయింట్ల లాభంతో 81,796.15 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం

227.90 పాయింట్ల లాభంతో 24,946 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.04గా ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభడ్డాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు 3435 డాలర్ల వద్ద ట్రెడైనది. ఈ స్థిరంగా ఉన్న క్రూడ్ ధరలు దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరల్లో పెరుగుదల సాధారణంగా మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్ను సూచిస్తుంది. గత రెండు సెషన్లలో సూచీలు అమెరికా-యూరప్ మార్కెట్ల ప్రతికూలతల వల్ల నష్టాల్లోకి వెళ్లాయి. ఈ రోజు బలమైన కొనుగోళ్లు, మెటల్ & రియల్టీ షేర్లలో జోరు మార్కెట్ను పాజిటివ్ మూడ్లోకి తీసుకొచ్చాయి.
Read Also: Stock market: ఈ వారం మార్కెట్ కు ఫార్మా, ఐటీ షేర్లే కీలకం