దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుందనే సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి. టెహ్రాన్ను ఖాళీ చేయాలని పౌరులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సూచించడం ఇందుకు నేపథ్యం. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రాంతీయ పోరుకు దారితీయొచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు కూడా పెరగడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,900 దిగువన ముగిసింది.
రూపాయి – డాలర్ మారకం విలువ
సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,869.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,796.15) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,427.01 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. సెన్సెక్స్ (Sensex) 212 పాయింట్ల నష్టంతో 81,583.30 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 93.10 పాయింట్ల నష్టంతో 24,853.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.24గా ఉంది. ఎటర్నల్, సన్ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి.

చమురు, బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.28 డాలర్ల వద్ద కొనసాగగా.. బంగారం ఔన్సు 3405 డాలర్ల వద్ద ట్రేడయింది. ఈ మారకం విలువ ఎగుమతి ఆధారిత కంపెనీలకు కొంత ప్రయోజనంగా ఉన్నా, ముడి సరుకుల దిగుమతిదారులకు భారంగా మారుతుంది. ఈ పరిణామాల మధ్య, పెట్టుబడిదారులు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, కమోడిటీ ధరలు, మరియు రూపాయి స్థిరత వంటి అంశాలను గమనించాలి. స్టాక్ మార్కెట్లోకి (Stock market) అడుగు పెట్టే ముందు సరైన పన్నీతి, పరిశీలన, మదుపు వ్యూహం అవసరం.
Read Also: Bike-Taxi: బైక్, ట్యాక్సీ ల నిలిపివేతతో ఒక్కరోజులోనే