వరుస లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets)వరుసగా నాలుగో రోజు కూడా లాభాల దిశలో పయనించాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన కంపెనీల షేర్లలో బలమైన కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 81,926 వద్ద, అలాగే నిఫ్టీ(nifty) 30.65 పాయింట్లు పెరిగి 25,108.3 వద్ద స్థిరపడింది.నిఫ్టీ కీలకమైన 25,000 మార్క్ పైన నిలవడం మార్కెట్లో సానుకూల భావనను పెంచిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్ తక్కువగా ఉన్న ప్రతీసారీ ఇన్వెస్టర్లు కొత్తగా కొనుగోళ్లు చేపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Read also: నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్

రంగాల వారీగా కొనుగోళ్లు – రియల్టీ రంగం ముందంజలో
రంగాల వారీగా చూస్తే, రియల్టీ రంగం 1.09 శాతం లాభంతో ముందంజలో నిలిచింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ రంగాల్లో కూడా సానుకూల ధోరణి కనిపించింది.అయితే ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్, మీడియా, మెటల్, ఐటీ రంగాల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లో ముగిశాయి.అంతేకాకుండా, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.47% మరియు నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 0.31% లాభపడి, మార్కెట్లో(Stock markets)కొనుగోళ్ల దోరణి బలంగా ఉందని సూచించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: