భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో రెండు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ (మధ్యంతర వాణిజ్య ఒప్పందం) కుదరనున్నట్లు తెలుస్తోంది (India-US Mini Trade Deal). 48 గంటల్లో అది ఖరారు కావొచ్చని, ఆ దిశగా వాషింగ్టన్లో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వ్యవసాయం & డెయిరీ రంగం – ప్రధాన చిక్కుముడులు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ల పైనే దృష్టిపెట్టారు. ముఖ్యంగా వ్యవసాయం, డెయిరీ రంగాల విషయంలో ఇరుదేశాల మధ్య చిక్కుముడులు నెలకొన్నాయి. భారత్ పాల ఉత్పత్తుల మార్కెట్ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు అమెరికా కొన్నిరకాల ఇండస్ట్రియల్ గూడ్స్కు, ఆటోమొబైల్ రంగంలో రాయితీలు కోరుతోంది. విద్యుత్తు కార్లు, వైన్స్, పెట్రోకెమికల్స్, డెయిరీ, యాపిల్, నట్స్, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం పట్టుబడుతోంది. ఇక, భారత్ నుంచి చేసుకొనే దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం విధించిన 26 శాతం టారిఫ్లు జులై 9 వరకు అమల్లోకి రావు. ఇక బేస్లైన్ టారిఫ్ 10శాతం మాత్రం వర్తిస్తోంది. ఈ చర్చల సందర్భంగా భారత్ 26శాతం పన్నుపై రాయితీ కోరుతోంది.

ట్రంప్ విధించిన టారిఫ్ల గడువు – కీలక సందర్భం
మరోవైపు.. వాణిజ్య ఒప్పందంపై (India-US Mini Trade Deal).కీలక ప్రకటన జులై 8 కంటే ముందే వెలువడవచ్చని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్న వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal) వాషింగ్టన్లో ఉండి తుదివిడత సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రంప్ విధించిన టారిఫ్ల సస్పెన్షన్ జులై 9వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ డెడ్లైన్ను మరోసారి పొడిగించే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు (Trump) వెల్లడించారు. అతిత్వరలోనే టారిఫ్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మినీ ట్రేడ్ డీల్ జరగొచ్చని తెలుస్తోంది.
మినీ ట్రేడ్ డీల్ ప్రయోజనాలు
దిగుమతులపై టారిఫ్ భారం తగ్గుతుంది.
రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పునరుజ్జీవనం పొందుతాయి.
లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కు నూతన అవకాశాలు.
Read Also: US: రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్కు అమెరికా ఆంక్షలు