శ్రావణమాసం వచ్చిందంటేనే పుణ్యకాలం, పూజలు, శుభకార్యాల హడావుడి మొదలవుతుంది. ఈ సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా చేరడంతో బంగారం కొనుగోళ్లకు విపరీతమైన డిమాండ్ (demand for gold purchases) ఏర్పడింది. దాంతోపాటు బంగారం ధరల (Gold Price) కు భయంకరమైన పెరుగుదల కనిపిస్తోంది.

బంగారం ధర భారీగా పెరిగింది
కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కదులుతున్న పసిడి ధరలు (Gold Price), ఈరోజు అమాంతం పైకి దూసుకుపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹820 పెరిగి ₹1,02,220కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర ₹750 పెరిగి ₹93,700 వద్ద నిలిచింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ₹76,700 వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణంగా శ్రావణ మాసం (month of Shravan), పెళ్లిళ్ల సమయం, అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యత వంటి అంశాలను భావిస్తున్నారు.
వెండి ధర కూడా షాక్ ఇస్తోంది!
బంగారమే కాదు, వెండి కూడా తన విలువను పెంచుకుంటోంది. గత వారం వరకు స్థిరంగా ఉన్న వెండి ధర, ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ₹2,000 పెరిగి ₹1,15,000కి చేరుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో ఇదే ధర కొనసాగుతుండగా చెన్నైలో వెండి ధర ₹10,000 ఎక్కువగా ఉంది, అంటే అక్కడ కేజీ వెండి ₹1,25,000కి చేరింది.
పసిడి ధరలు ఇలా పైకి దూసుకుపోతున్న తరుణంలో కొనుగోలుదారులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళిక వేసుకుంటే మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Read also: