అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు చాలామంది గోల్డ్ లోన్ను(Gold Finance) ఎంచుకుంటారు. బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారంపై రుణం త్వరగా లభిస్తుంది. పెద్దగా ప్రక్రియలు లేకుండా, పూచీకత్తు లేదా సిబిల్ స్కోర్ అవసరం లేకుండానే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త తెలిపింది. ఇటీవల RBI బంగారు రుణాలకు సంబంధించి మూడు ముఖ్యమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి రుణగ్రహీతలకు ఎక్కువ ప్రయోజనాలు, భద్రత మరియు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నాయి.
Read Also:Gold rates today : బంగారం ధర షాక్, వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట

1. లోన్ టు వ్యాల్యూ (LTV) నిష్పత్తి పెంపు
ఇంతకు ముందు బంగారం(Gold Finance) విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం ఇచ్చేవారు. కొత్త నిబంధనల ప్రకారం LTVను 85 శాతం వరకు పెంచారు. అంటే ఒక లక్ష రూపాయల విలువైన బంగారంపై ఇప్పుడు రూ.85,000 వరకు రుణం పొందవచ్చు.
అయితే రుణ మొత్తాన్ని బట్టి LTV శాతం మారుతుంది:
- రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకుంటే 85% LTV
- రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఉంటే 80% LTV
- రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణానికి 75% LTV వర్తిస్తుంది
ఈ విధానం రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
2. టాప్-అప్ గోల్డ్ లోన్ సౌకర్యం
ఇప్పటికే తీసుకున్న గోల్డ్ లోన్పై అదనంగా మరింత రుణం పొందే అవకాశం కల్పించే టాప్-అప్ లోన్ను బ్యాంకులు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉపయోగిస్తారు. అయితే టాప్-అప్ లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాలి.
3. బంగారం తిరిగి ఇవ్వడంపై కఠిన గడువు
రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు 7 పని దినాల్లోపు బంగారాన్ని తిరిగి ఇవ్వాలి. గడువు మించితే ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున బ్యాంకులు రుణగ్రహీతకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 రోజులకు బంగారం ఇచ్చినట్లయితే 3 రోజులకు రూ.15,000 పెనాల్టీ చెల్లించాలి. ఈ కొత్త మార్పులు గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎక్కువ రుణం, అదనపు నిధుల అవకాశం, అలాగే బంగారం భద్రతపై నమ్మకాన్ని పెంచనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: