EPFO: దేశంలోని కోట్ల మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో షాక్ తగిలేలా కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయం లక్షలాది మంది వేతన జీవుల పొదుపుపై ప్రభావం చూపనుంది.
Read Also: Karnataka: భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

మార్చి మొదటి వారంలో కీలక నిర్ణయం
ఈ వడ్డీ రేట్ల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) వచ్చే మార్చి మొదటి వారంలో సమావేశం కానుంది. ఈ హైలెవల్ మీటింగ్లో ఈపీఎఫ్ఓ (EPFO) తన వద్ద ఉన్న నిధులు, పెట్టుబడుల ద్వారా వచ్చిన రాబడిని విశ్లేషించి వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేయనుంది.
ఎంత తగ్గే అవకాశం ఉంది?
ప్రస్తుత అంచనాల ప్రకారం, వడ్డీ రేటును 8 శాతం నుండి 8.20 శాతం మధ్యకు పరిమితం చేయవచ్చని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈసారి స్వల్ప కోత తప్పదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వడ్డీ రేటు తగ్గడానికి ప్రధాన కారణాలివే..
వడ్డీ రేట్లు తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:
- పెరిగిన లబ్ధిదారులు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి వికాసిత్ భారత్ రోజ్గార్ యోజన’ కింద రికార్డు స్థాయిలో కొత్త సభ్యులు EPFOలో చేరారు. లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగడంతో, అందరికీ సమానంగా వడ్డీ పంపిణీ చేయడం భారంగా మారింది.
- బఫర్ నిధుల నిర్వహణ: భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి EPFO కొంత మొత్తాన్ని ‘బఫర్ నిధి’గా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఈ సేఫ్టీ ఫండ్ నిర్వహణ కోసమే వడ్డీలో కొంత కోత విధించే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: