దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దీపిందర్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ఒక వ్యవస్థ ప్రాథమికంగా బాగోలేకపోతే, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్థిరంగా అందులో పనిచేయడానికి ముందుకు రారు. కొందరు స్వార్థ ప్రయోజనాలతో చేసే ప్రచారాలను నమ్మవద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read also: Gold Rate 02/01/26 : బంగారం ధరలు పెరిగాయి , వెండి ధర తగ్గింది
పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు
డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75 లక్షలక డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్ సంస్థల CEO దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపులో ఉంచడంలో సహకరించిన స్థానిక పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బెదిరింపులు ఉన్నప్పటికీ పనికి హాజరై నిజాయతీగా పనిచేసిన డెలివరీ భాగస్వాములను ఆయన అభినందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: