हिन्दी | Epaper
లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా

CBN Delhi : రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Sudheer
CBN Delhi : రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీలోకి చేరుకొని అక్కడి కీలక అధికారులతో సమావేశాలు జరపనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ‘సీఐఐ’ (Confederation of Indian Industry) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలపై ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై సీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Rural Development - ఉపాధి హమీ పథకంలో పూర్తి స్థాయి పనులు – సీఎం చంద్రబాబు

విశాఖ పర్యటనపై దృష్టి

ఢిల్లీ పర్యటన అనంతరం ఎల్లుండి సీఎం నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని పరిశీలించనున్నారు. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌ రెండో రాజధాని కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్టుబడుల ప్రోత్సాహం, కొత్త ప్రాజెక్టుల అమలు, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై సీఎం అక్కడ సమీక్షలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Telugu News: ACB Court: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

ఇంద్రకీలాద్రి దర్శనం

ఢిల్లీ పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు కాసేపట్లో ఇంద్రకీలాద్రి చేరుకొని కనకదుర్గమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. దసరా సందర్భంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దసరా మహోత్సవాల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాన్ని దర్శించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈసారి కూడా సీఎం అదే పద్ధతిలో దేవీ దర్శనం తీసుకోవడం విశేషం. రాజకీయ, పరిపాలనా బిజీ షెడ్యూల్ మధ్యలో ఇలాంటి దర్శనాలు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తున్నట్లు చూపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870