ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే వినియోగదారులకు షాక్ ఇస్తూ చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నెలలుగా స్థిరంగా కొనసాగిన ధరలు, కేవలం రెండు వారాల వ్యవధిలోనే అమాంతం పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది.
Read also: CM Chandrababu: బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం అభినందనలు
ధరలు ఇలా!
గతంలో కిలో రూ. 260 వద్ద ఉన్న బ్రాయిలర్ చికెన్ ధర, ఇప్పుడు ఏకంగా రూ. 300 మార్కును తాకింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 300 పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ. 170కి చేరింది.

ఫారం కోడి మాంసం కిలో రూ. 180, బండ కోడి మాంసం రూ. 280గా అమ్ముతున్నారు. రానున్న సంక్రాంతి పండుగ డిమాండ్, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారాల్లో దాణా, రవాణా ఖర్చులు పెరగడం, ఇటీవల కోళ్లకు వ్యాధులు సోకడంతో రైతులు ఉత్పత్తిని తగ్గించడం కూడా ధరల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: