BRS supports the Congress resolution

కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. భారత రత్న పుస్కారం పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులని కేటీఆర్ అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు.

ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.

కాగా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. ఆర్థిక వేత్తగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ హయంలోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు.

Related Posts
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ?
బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు

బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? బర్డ్ ఫ్లూ (Avian Influenza) ఒక వైరల్ Read more

ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని క్యాప్చర్ చేయండి.. ఒప్పో
OPPO Reno13 series launched in India with new MediaTek Dimensity 8350 chipset and AI ready cameras

OPPO Reno13 సిరీస్ GenAIని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది భారతదేశ మార్కెట్లో AI-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త కొలమానాలను నిర్దేశిస్తుంది. IP66 / Read more

ఎన్నికల హడావుడి!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా వారికి శిక్షణ పూర్తి Read more

Railway : కుంగిన రైల్వే వంతెన.. నిలిచిన రైళ్లు
4 more special trains for Sankranti

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెన కుంగిన ఘటన రైలు ప్రయాణికులకు అంతరాయంగా మారింది. అర్ధరాత్రి సమయంలో భారీ వాహనం (టిప్పర్) వంతెనపై నుంచి Read more