BRS supports the Congress resolution

కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. భారత రత్న పుస్కారం పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులని కేటీఆర్ అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు.

ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.

కాగా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. ఆర్థిక వేత్తగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ హయంలోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు.

Related Posts
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని
Charlapalli railway terminal was inaugurated by the Prime Minister

హైదరాబాద్‌: రైల్వేశాఖ తమ నెట్ వర్క్ మరింత విస్తరించేందుకు మరో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ ను Read more

రూ.800, రూ.900 నాణేలు చూసారా?
అరుదైన నాణేలు! రూ.800, రూ.900 వెండి నాణేలు గురించి తెలుసా?

మనకు రోజూ కనిపించే రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతోపాటు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మింట్ లిమిటెడ్ ఎడిషన్ Read more

నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు Read more

స‌హానా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జ‌గ‌న్
YS Jagan counseled Sahana family

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలోని యువతి సహానా రౌడీషీటర్ నవీన్ చేత దాడి అయ్యి తీవ్రంగా గాయపడిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని గుంటూరు Read more