BRS Maha Dharna in Nalgonda today

నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా

హైదరాబాద్‌ : బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా రైతులను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు సమస్యలపై షాబాద్ లో రైతు ధర్నా చేసిన విషయం తెలిసిందే.

రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని, వాటిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కూడా పాల్గొననున్నారు. జంగ్ సైరన్ పేరిట ఈ ధర్నాను బీఆర్ఎస్ నిర్వహించనుంది.

image

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ, రైతు భరోసా, కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు. ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

కాగా, జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ధి ఈ డూప్లికేట్ గాంధీలకు ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts
నేడు సాలూరులో పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan visit to Kadapa today

విశాఖ: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం పవన్‌ Read more

ఆప్ పథకాలపై గవర్నర్ దర్యాప్తు
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశం లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఆప్ ఢిల్లీ సంక్షేమ పథకాలపై దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు సందీప్ Read more

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. సీఎం రేవంత్ కీలక ఆలోచన?
1488570 cm revanth reddy

తెలంగాణ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న Read more

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
liquor sales in telangana jpg

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. Read more