हिन्दी | Epaper

విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం

Sudheer
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ముఖ్యంగా కూటమి నేతలు ఈ వ్యవహారంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ..వైసీపీ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. విశాఖను డ్రగ్ క్యాపిటల్‌గా మార్చేశారంటూ పవన్ కళ్యాణ్, పురందీశ్వరి వంటి నేతలు ఆరోపణలు గుప్పించారు.

అయితే తాజాగా, సీబీఐ ఈ కేసుపై చేసిన ప్రకటనలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. డ్రగ్స్‌ ఉన్నాయన్న అనుమానాలతో పరిశీలించిన కంటైనర్లో ఏ డ్రగ్స్ కూడా లేవని వెల్లడించింది. ఈ ప్రకటనతో కేసు మరింత వివాదాస్పదంగా మారింది. కొన్ని రాజకీయ వర్గాలు గతంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు వట్టి వాదనలుగా మిగిలిపోయాయి.

ఈ ఘటన కూటమి నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లేవనేది సీబీఐ ప్రకటనతో తేటతెల్లమైంది. అయితే, ఇదే సమయంలో ప్రతిపక్షం వైసీపీపై మరింత వేధింపులకు దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పక్షపాతంతోనే ఇలాంటి ఆరోపణలు వచ్చాయా? లేదా నిజంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడారా? అనే విషయంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి.

కేసు మొదట్లో విశాఖపట్నం పోర్టుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వాదనతో పాటు, దీని వెనుక ఉన్న పెద్ద వ్యక్తుల జాడ తెలుసుకోవాలని పిలుపు వినిపించింది. అయితే ఇప్పుడు సీబీఐ ప్రకటనతో ఆ వాదనల్లో నిజం లేదని తేలడంతో కూటమి నేతలు గందరగోళానికి గురయ్యారని అనిపిస్తోంది. సీబీఐపై కూడా ఒక వర్గం నమ్మకం లేకుండా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

సీబీఐ ప్రకటన తర్వాత కూటమి నేతలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తమ ఆరోపణల గురించి మరింత వివరణ ఇవ్వడం లేదా స్పందించకపోవడం రాజకీయ దృష్టితో అనుమానాస్పదంగా మారింది. ఈ కేసు అనేక విమర్శలకు, రాజకీయ దూషణలకు దారితీసినప్పటికీ, సీబీఐ ప్రకటన తరువాత రాజకీయ వర్గాల మౌనం ప్రజల్లో కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

📢 For Advertisement Booking: 98481 12870