हिन्दी | Epaper

కూటమి సర్కార్‌పై అంబటి ఆగ్రహం

Sudheer
కూటమి సర్కార్‌పై అంబటి ఆగ్రహం

కూటమి సర్కార్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, అలాంటి వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామ‌ని అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై న‌మోదు చేస్తున్న అక్ర‌మ కేసులు, అరెస్టుల‌పై అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వందకు పైగా కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. మా వాళ్ల‌ను అరెస్టు చేశారు మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియా వాళ్లు చాలా దారుణంగా వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌పై, నాయకులపై దారుణంగా పోస్టులు పెట్టారు. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేద‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు

వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్నారని అంబటి ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయన ఫిర్యాదు చేశారు. త జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐటీడీపీ అనే పేరుతో అసభ్య పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై మాత్రం 300 కేసులు నమోదు చేశారని చెప్పారు.

టీడీపీ నాయకుల చెప్పుచేతల్లో పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నట్లు కనబడుతోందని మండిపడ్డారు. ఇలానే పోలీసులు వ్యవహరిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870