हिन्दी | Epaper

ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

sumalatha chinthakayala
ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

కాగా, ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని వెంటనే అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. యాప్‌లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేధించాలని కోరుతున్నారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కు ముందు యావరేజ్ గా రూ.1000 సంపాదన ఉంటే.. ఇప్పుడు రూ.500 కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

📢 For Advertisement Booking: 98481 12870