हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Cyber ​​Attack : రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

Sudheer
Cyber ​​Attack : రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళ సైబర్ మోసానికి గురై, క్షణాల్లో తన ఖాతా నుంచి భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఈ సంఘటన ప్రముఖ ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) పేరుతో జరిగింది. ఆ మహిళ జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేయగా, ఆ ఆర్డర్‌కు సంబంధించిన రీఫండ్ పొందడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పొరపాటున ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి తప్పుడు కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసింది. ఈ పొరపాటే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారింది. వెంటనే అప్రమత్తమైన కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించేందుకు రంగంలోకి దిగారు. రీఫండ్‌ ఇస్తామంటూ నమ్మించి, ఆమెకు వాట్సాప్‌లో ఒక అనుమానాస్పద APK ఫైల్‌ను పంపించారు.

News Telugu: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలు


సైబర్ నేరగాళ్లు పంపిన ఆ APK (Android Package Kit) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిందిగా మహిళను కోరారు. ఆ ఫైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయగానే, అది ఆమె మొబైల్ ఫోన్ నియంత్రణను లేదా బ్యాంకింగ్ వివరాలను దొంగిలించేలా రూపొందించబడిందని తరువాత తెలిసింది. ఈ సాంకేతిక మోసం ద్వారా కేటుగాళ్లు ఆమె బ్యాంక్ వివరాలను తెలుసుకుని, ఏకంగా మూడు వేర్వేరు అకౌంట్ల నుంచి దఫాలవారీగా మొత్తం రూ. 87,000 మొత్తాన్ని దోచుకున్నారు. రీఫండ్ కోసం ప్రయత్నించిన మహిళ, తన ఖాతాలో ఉన్న డబ్బు మాయమవడంతో షాక్‌కు గురైంది. తనది సైబర్ మోసంగా గుర్తించిన వెంటనే ఆమె అప్రమత్తమైంది.

Cyber ​​crime
Cyber ​​crime

తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక, సైబర్ మోసాల విషయంలో తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ అయిన 1930కి కూడా ఆమె సమాచారం అందించింది. కస్టమర్ కేర్ నంబర్లను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చెక్ చేయాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపే APK లేదా ఇతర అనుమానాస్పద లింకులను, ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని సైబర్ నిపుణులు ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870