ఆంధ్రప్రదేశ్లో విద్యను అందరికీ అందించాలనే సంకల్పంతో తీసుకొచ్చిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. రెండు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం.. ఇప్పుడే డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని స్కూలుకు పంపించి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది వైసీపీ విధానం. కానీ ప్రజా ప్రభుత్వం లో విద్య అనేది హక్కు’’ అని నారా లోకేశ్ అన్నారు
తల్లుల ఖాతాల్లోకి నిధుల జమ
పిల్లలు పాఠశాల విద్యను పూర్తిగా పొందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యను ప్రోత్సహించేందుకు, పిల్లల హాజరు పెంచేందుకు, తల్లుల ప్రోత్సాహానికి ఈ విధంగా నగదు మద్దతు అందిస్తోంది. ‘‘మా ఖాతాలో డబ్బులు వచ్చాయి. మా పిల్లలు చదివేలా ప్రభుత్వం నడుస్తోంది’’ అంటూ పలువురు తల్లులు చెప్పిన వీడియోను నారా లోకేశ్ తన అధికారిక X (పూర్వం ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.
హామీల అమలే మా లక్ష్యం
“మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం మొదలుపెట్టింది. తల్లికి వందనం ప్రోగ్రామ్ అమలు సాక్షాత్తుగా నమ్మకాన్ని పెంచుతోంది,” అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యను ఓ ఆయుధంగా భావించే ప్రభుత్వం కావాలంటే, ప్రతి పేద కుటుంబానికి మద్దతు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే రోజుల్లో మరిన్ని విద్యా ప్రోత్సాహక పథకాలతో ముందుకు వస్తామని, ఒకరు కాదు – ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ చదువు అందేలా చూడడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Also : Banana: నల్లటి మచ్చలున్న అరటి పండు ఆరోగ్యానికి మంచిదా?
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చదివించి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది వైసిపి విధానం.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకోవాలి అనేది ప్రజా ప్రభుత్వం నినాదం.#HappyMothersInAP #TallikiVandanam#PromiseDelivered #AndhraPradesh pic.twitter.com/WDwCjNuFZi— Lokesh Nara (@naralokesh) June 14, 2025