हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Latest news: Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

Saritha
Latest news: Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

వాహనాల రాకపోకలకు సిద్ధం చేస్తున్న అధికారులు

విజయవాడ : విజయవాడ(Vijayawada) పశ్చిమ బైపాస్ (ప్యాకేజీ-3)లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న విద్యుత్ హైటెన్షన్ వైర్ల అలైన్మెంట్ వివాదానికి హైకోర్టు తీర్పుతో స్పష్టత లభించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో పశ్చిమ బైపాస్ రహదారి త్వరలో వాహనాల రాకపోకలకు సిద్ధమవుతున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. జక్కంపూడి, అంబాపురం ప్రాంతాల్లోని ఆరు టవర్ల విషయంలో పాత అలైన్మెంట్ ప్రకారమే టవర్లను ఉంచి, వాటి ఎత్తును పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో రైతులు, ఎన్హెచ్ఎఐ మధ్య వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ఇన్న పశ్చిమ బైపాస్ రహదారి ప్యాకేజీ-3లో జక్కంపూడి, అంబాపురం, నున్న పరిధిలో మొత్తం 8 విద్యుత్ టవర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి రోడ్డు ఉపరితలం నుంచి 9 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఎన్హెచ్ఎఐ, ల్యాంకో పవర్ ప్రాజెక్ట్ సంస్థలు ఈ ఎవర్లను తొలగించి కొత్త అలైన్మెంట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే, దీనికి వ్యతిరేకంగా జక్కంపూడి.. అంబాపురంలోని 24 మంది రైతులు, నున్నలోని 8 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాత అలైన్మెంట్ని కొనసాగిస్తూ వైర్ల ఎత్తును పెంచాలని డిమాండ్ చేశారు.

Read also: ట్రంప్ సీటుపై జేడీ వాన్స్ కన్నేశారా? ఉష మతంపై ఆయన అభిప్రాయం అదేనా!

Vijayawada
Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

హైకోర్టు తీర్పుతో పశ్చిమ బైపాస్ ప్రాజెక్టుకు వేగం వచ్చింది

ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పాత మార్గం ప్రకారమే టవర్ల ఎత్తును రోడ్డుపైనుంచి కనీసం 14 మీటర్లకు పెంచాలని స్పష్టమైన తీర్పు(Vijayawada) ఇచ్చారు. రైతులు తమ ఆవేదనను ప్రధాని కార్యాలయం, కేంద్ర రహదారుల శాఖ మంత్రికి కూడా తెలియజేశారు. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు. వ్యవసాయ భూములకు నష్టం కలగకుండా ప్రాజెక్టు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్యాకేజీ-3లో పనులు దాదాపు పూర్తి కావొచ్చే దశలో ఉన్నాయి. విద్యుత్ వైర్ల ఎత్తుపై తలెత్తిన వివాదం కారణంగా రహదారిని వాడుకలోకి తీసుకురాలేక పోయారు. నున్నలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అక్కడ పెద్దగా అడ్డంకులు లేనందున అదే విధమైన తీర్పు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాబోయే పది రోజుల్లో నున్న టవర్ల విషయంలోనూ కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ వివాదం పరిష్కారం అవగానే పశ్చిమ బైపాస్ రహదారి పూర్తిస్థాయిలో ప్రయాణానికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. విజయవాడ నగర రవాణాకు ఈ మార్గం కొత్త ఊపిరినిచ్చేలా మారనుంది.

ప్రభుత్వ చొరవతోనే పరిష్కారం సాధ్యమైంది

పశ్చిమ బైపాస్ ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైన ఈ టవర్ల వివాదం పరిష్కార దిశగా సాగడానికి కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ప్రజాప్రతినిధులు నిత్యం కేంద్రంలో, రైతులతో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ప్రిన్సివల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కలెక్టర్ లక్ష్మీశన్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైతులు, ఎన్హెచ్ఎఐ, పవర్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి తగిన పరిష్కారం సూచించింది. ఎన్హెచ్ఎఐ కూడా సానుకూలంగా స్పందించడంతో, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో ప్రస్తుతం పశ్చిమ బైపాస్ పూర్తి దిశగా అడుగులు పడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు
1:05

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి సవిత

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి సవిత

బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక

బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870