విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat)కు మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా ట్రాక్పైకి వచ్చిన ఓ ఎద్దును రైలు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న రైలు, ఎద్దును బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇంజిన్ ముందు భాగం ధ్వంసం
ఘటన తాలూకు తీవ్రతతో వందేభారత్ రైలు ఇంజిన్ (Engine) ముందు భాగం దెబ్బతింది. ఢీకొట్టిన సమయంలో వచ్చిన గట్టివాటంతో రైలు కొంతసేపు అక్కడే నిలిచిపోయింది. సిబ్బంది తక్షణమే అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించారు. ఇంజిన్లో భాగంగా బయట భాగం ధ్వంసమైనా, అంతర్గత సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.
ఎద్దును తొలగించి రైలు తిరిగి ప్రయాణం
కాసేపటి తర్వాత రైల్వే సిబ్బంది ఎద్దును ట్రాక్ పై నుంచి తొలగించగా, ట్రైన్ మళ్లీ బయల్దేరింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఆనందదాయక విషయం. అయితే ఈ ఘటన తర్వాత కొద్దిసేపు రైలు ప్రయాణానికి అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. పశువులు ట్రాక్పైకి ఎలా వచ్చాయనే విషయంపై స్పష్టత రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also : KTR : కేటీఆర్.. లోకేశ్ ను ఎందుకు కలుస్తున్నావ్? – సామ రామ్మోహన్