हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

Sudha
Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

కేంద్ర మంత్రివర్గ (Union Cabinet)సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది రూ.1,507 కోట్లతో ఈ ఎయిర్‌పోర్ట్‌ని నిర్మించనున్నారు. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లలో ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం (Union Cabinet )ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం రూ.9,814 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. రాజస్థాన్ ప్రభుత్వం కోట-బుండి విమానాశ్రయానికి ఉచితంగా భూమిని ఇస్తుందని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మంగళవారం మంత్రివర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

 Union Cabinet :  గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం
Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ (Greenfield Airport) ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిధులు సమకూరుస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. విమానాశ్రయం కోసం 1,089 ఎకరాల భూమిని రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త విమానాశ్రయం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని వైష్ణవ్ అన్నారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తన అంతర్గత వనరుల నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుందని.. 24 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాల్లో దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025లో 162కి రెట్టింపు అయ్యిందని ఆయన అన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 2014లో 16.8 కోట్ల నుంచి ఈ సంవత్సరం 41.2 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ( Union Cabinet )ఆమోదం తెలిపినట్లు వివరించారు.

భారతదేశంలో కేంద్ర మంత్రివర్గం ఎలా ఏర్పడుతుంది?

రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు. కౌన్సిల్ లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది.

కేంద్ర మంత్రివర్గానికి అధిపతి ఎవరు?

క్యాబినెట్, మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలు ఈ మంత్రివర్గానికి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు మరియు భారత పరిపాలనా సేవ మరియు ఇతర పౌర సేవల అధిపతిగా కూడా వ్యవహరించే క్యాబినెట్ కార్యదర్శి సలహా ఇస్తారు.

భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పదవి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(1) ప్రకారం కార్యనిర్వాహక అధికారం ప్రధానంగా భారత రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతికి అన్ని రాజ్యాంగ అధికారాలు ఉన్నాయి మరియు పైన పేర్కొన్న ఆర్టికల్ 53(1) ప్రకారం వాటిని నేరుగా లేదా అధీన అధికారుల ద్వారా అమలు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/isro-40-floors-rocket-gaganyaan-chandrayaan4/breaking-news/532670/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్
0:41

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

📢 For Advertisement Booking: 98481 12870