గాజా ప్రాంతంలో జరుగుతున్న సీజ్ ఫైర్ ఉల్లంఘనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “హమాస్ హింసను ఆపకపోతే వారి ఉనికినే అంతం చేస్తాం” అని స్పష్టంగా చెప్పారు. గాజా ప్రాంతంలో పదే పదే జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుండటంతో, అమెరికా సీరియస్గా స్పందిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై పెద్ద చర్చకు దారితీశాయి.
Latest News: Khamenei:ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ మాట్లాడుతూ, “కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా హింస తగ్గుతుందని మేము ఆశించాం. కానీ హమాస్ తిరిగి ఉల్లంఘనలు చేస్తే కౌంటర్ అటాక్ తప్పదు. అది భయంకరమైనదిగా ఉంటుంది” అని హెచ్చరించారు. గాజా సీజ్ ఫైర్ అమలు కోసం యూఎస్, ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ, హమాస్ వైపు నుంచి దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆ ప్రాంతంలోని ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఇజ్రాయెల్ సైన్యం కూడా హమాస్ దాడులకు ప్రతిగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేసింది. యూఎస్ ఇప్పటికే హమాస్ను తీవ్రవాద సంస్థగా గుర్తించి, వారికి నిధుల సరఫరా లేదా మద్దతు ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామాలతో గాజా ప్రాంతంలోని శాంతి ప్రయత్నాలు మరోసారి సంక్లిష్ట దశలోకి వెళ్లాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి హమాస్ తదుపరి నిర్ణయాలపై, అలాగే అమెరికా చర్యలపై కేంద్రీకృతమై ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/