J&Kలో విషాదం.. కల్చరల్, ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు రద్దు

Read Time:  1 min
J&Kలో విషాదం.. కల్చరల్, ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు రద్దు
FONT SIZE
GET APP

జమ్మూ కశ్మీర్‌ను ఇటీవల క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు (Flood) తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం జరగాల్సిన ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేత

వరదల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రేపు జరగాల్సిన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విపత్తులో బాధితుల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ, అధికారిక కార్యక్రమాలైన స్పీచ్, మార్చ్ ఫాస్ట్ వంటివి యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజలకు ప్రభుత్వం అండ

ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం తెలిపారు.

Read Also : Telangana Rains : తెలంగాణలో మూడు రోజుల్లో భారీ వర్షాలు

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.