हिन्दी | Epaper

Kaleshwaram Project Commission : PC ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ

Sudheer
Kaleshwaram Project Commission : PC ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kaleshwaram Project)పై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala ) జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు లేఖ రాశారు. గతంలో BRS ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు, అలాగే క్యాబినెట్ సమావేశాల మినిట్స్‌కి సంబంధించిన పత్రాలను ఈ లేఖతో పాటు పంపించారు. ఈ విషయాలన్నింటిపై కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

తుమ్మల – ఈటల వాదనల మధ్య భిన్నత

ఇప్పటి వరకు కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, 3 బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ ఉపసంఘం సూచనల మేరకే చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ వాదనను తుమ్మల ఖండించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఉపసంఘ నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమయ్యిందని వివరించారు. దీనిని అధికారిక పత్రాలతో కమిషన్‌కు వివరించారు.

ప్రాజెక్టు అంచనాలు

తుమ్మల పంపిన లేఖతో కాళేశ్వరం ప్రాజెక్టుపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా BRS ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అధికారిక ప్రక్రియలపై విచారణకు ఇది బలమైన ఆధారాలుగా మారవచ్చని భావిస్తున్నారు. ఇక జూలైలో కమిషన్ తుది నివేదిక ఇవ్వనుండగా, తాజా లేఖ ఆ నివేదిక రూపకల్పనలో కీలకంగా నిలవనుంది.

Read Also : Thalliki Vandanam : రేపే ఖాతాల్లోకి రూ.15వేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

📢 For Advertisement Booking: 98481 12870