हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Terrorists : ఏపీలో ఉగ్రవాదుల కలకలం

Sudheer
Terrorists : ఏపీలో ఉగ్రవాదుల కలకలం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉగ్రవాద (Terrorists ) కదలికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ధర్మవరం కోట ప్రాంతంలో కొందరు వ్యక్తులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం అందడంతో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా స్థానికంగా ఓ హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్న 40 ఏళ్ల నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నూర్ ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తెలిపారు.

16 సిమ్ కార్డుల స్వాధీనం

ఎన్‌ఐఏ (NIA ) అధికారులు నూర్ నివాసంలో సోదాలు నిర్వహించి, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా నూర్ ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా చాటింగ్‌లు జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నూర్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

దర్యాప్తు కొనసాగింపు

నూర్ వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అతని కదలికలు, సంప్రదింపుల వివరాలను ఎన్‌ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. ఈ దర్యాప్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికల నెట్‌వర్క్‌పై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. అక్రమ నివాసితులు, ఉగ్రవాద అనుబంధ కార్యకలాపాలపై అధికారులు నిఘా పెంచారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

https://vaartha.com/app-job-notification-telangana-police-recruitment-2025/more/career/531095/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870