Telangana municipal elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు, నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించనున్నట్లు కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, అవసరమైతే ఫిబ్రవరి 12న రీ–పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.
Read Also: Budget 2026: బడ్జెట్పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలంతా తప్పకుండా (Telangana municipal elections) ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసుల నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.
నగదు రవాణాపై కూడా కఠిన నియమాలు అమలు చేస్తున్నట్లు ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. వ్యక్తులు గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అంతకంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని, లేనిపక్షంలో నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన సందర్భాల్లో పోలీసుల నుంచి రిసీప్ట్ ఇస్తారని, దాని ఆధారంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: