నేడు విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్, సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 600 మార్కులకు గాను 583 మార్కులతో కోట సాయి అండని అనే విద్యార్థిని ప్రథమ స్థానాన్ని సాధించగా, 580కి పైగా మార్కులు సాధించిన మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. అంతేకాక, 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 15గా ఉంది.
ఆంగ్లంలో 27 మంది, గణితంలో 21 మంది, సైన్స్లో 13 మంది, సోషల్లో 12 మంది, హిందీలో 12 మంది, తెలుగులో 13 మంది విద్యార్థులు ‘A’ గ్రేడ్ సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ ఫలితాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రమశిక్షణ, సమయపాలన, ఖచ్చితమైన కరిక్యూలమ్ అమలుకి నిదర్శనంగా నిలుస్తున్నాయని సంస్థల అధినేత మల్లెంపాటి ఆదర్శ్ పేర్కొన్నారు.
ఈ విజయాన్ని పురస్కరించుకొని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NTSE, 10QM, JSU, NASA, INTSO, KAT, Sujets Olympiad లాంటి పోటీ పరీక్షల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలుస్తారని డైరెక్టర్ తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో విద్యార్థుల విశ్వస్థాయిలో ప్రతిభను మెరిపించడానికి పునాది కానున్నాయి.