తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామానికి వెళ్లి ప్రజలతో కలిసిపోయారు. అక్కడే సన్నబియ్యం పథకం ద్వారా లాభపడిన కుటుంబాన్ని కలిశారు. వాళ్ల ఇంటికెళ్లి వాళ్లతో కలిసి భోజనం చేశారు.పేదవారి జీవితం ఎలా ఉంది? పథకం వలన వారు ఎలా లాభపడుతున్నారు? అనే విషయాలను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం ఈ అడుగు వేశారు. వాళ్ల వంటింట్లో వండిన సన్నబియ్యం తినడం ద్వారా ప్రభుత్వ పథకం ప్రభావాన్ని నేరుగా తెలుసుకున్నారు.ఈ సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా భావోద్వేగంగా స్వీకరించారు. తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం.కళ్లల్లో ఆనందం.స్వయంగా రుచిచూశాను, అని భావోద్వేగంతో తెలిపారు. పథకం ప్ర జల జీవితాల్లో మార్పు తెస్తోందని హర్షం వ్యక్తం చేశారు.పథకం అమలును నేరుగా పరిశీలించిన సీఎం, భోజనంతోపాటు వాళ్ల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకున్నారు.

తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా సంక్షేమానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు.ఇందుకు ముందు రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అర్పించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా హారతులు సమర్పించారు.రేవంత్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి సాధారణ ప్రజల మధ్యకు వెళ్లి, వారి సమస్యలు విని, ప్రత్యక్షంగా పథకాలను పరిశీలించడం ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో నమ్మకం పెంచుతోంది.
READ MORE : MS Dhoni: ధోనీ రిటైర్మెంట్పై స్పందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్