हिन्दी | Epaper

Rs.20 Notes : కొత్త రూ.20 నోట్లు విషయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన

Sudheer
Rs.20 Notes : కొత్త రూ.20 నోట్లు విషయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా కొత్త రూ.20 నోట్ల (Rs.20 Notes) విడుదలపై కీలక ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో భాగంగా ఈ కొత్త నోట్లు విడుదల కానున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లను ముద్రించనున్నారు. కొత్త డిజైన్‌తో కూడిన ఈ నోట్లు త్వరలోనే ప్రస్తుత చలామణిలోకి రానున్నాయి. అయితే ఇప్పటికే చలామణిలో ఉన్న పాత రూ.20 నోట్లకు ఏమాత్రం ముప్పు లేదు. అవన్నీ యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

కొత్త రూ.20 నోట్ల పరిమాణం

కొత్త రూ.20 నోట్ల పరిమాణం 63 మిల్లీమీటర్లు x 129 మిల్లీమీటర్లుగా ఉండనుంది. ఈ నోటుకు ‘గ్రీనిష్ యెల్లో’ అనే ఆకర్షణీయమైన రంగు ప్రధానంగా ఉండబోతోంది. ఇది మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని ఇతర నోట్ల డిజైన్‌లకు అనుగుణంగా ఉంటుంది. కొత్త నోట్ల వెనుక భాగంలో ప్రముఖ హిస్టారికల్ స్థలమైన ఎల్లోరా గుహల చిత్రం ముద్రించబడుతుంది. భారతదేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం ఎంపిక చేయడం విశేషం.

కొత్త నోట్లలో డిజైన్లు

ఈ కొత్త నోట్లలోని ఇతర డిజైన్లు, భద్రతా లక్షణాలు, ప్యాటర్న్లు మెయిన్ కలర్‌కు సరిపడేలా రూపొందించబడ్డాయి. ఆర్‌బీఐ ప్రకారం, ఈ మార్పులు ప్రజలకు మరింత సులభతరమైన గుర్తింపునిచ్చేలా, నోట్ల దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో చేపట్టబడ్డాయి. మొత్తానికి, కొత్త రూపంలో రూ.20 నోట్లు త్వరలో ప్రజల చేతిలోకి రానున్నాయి. పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టత రావడంతో ప్రజలకు ఏ విధమైన గందరగోళం అవసరం లేదు.

Read Also : MissWorld :గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీల్లో పాల్గొన సుందరీమణులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870