हिन्दी | Epaper

Pithapuram: పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ పోస్టులు

Sudheer
Pithapuram: పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను అవమానించేలా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో పోస్టులు పెట్టిన ముగ్గురిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదుతో ఈ అరెస్టులు జరిగాయి.

మార్ఫింగ్ ఫోటోతో అసభ్య ప్రచారం

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి పవన్‌ను కించపరిచేలా ప్రచారం చేశారు. మార్ఫింగ్ చేసిన ఫోటోను వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచారు. ఈ చర్య పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి పిఠాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మూడు ప్రాంతాల నుంచి నిందితుల అరెస్ట్

పోలీసుల విచారణలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాకు చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్టణం వలందపాలెంకు చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్ సరూర్‌నగర్ సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఇందులో పాత్ర వహించినట్లు తేలింది. వారిని అరెస్టు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోష‌ల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read Also : APSRTC: 2 వేల బస్సులు కొనేందుకు సిద్ధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870