PM Modi : జోహానెస్బర్గ్లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా–కెనడా–ఇండియా టెక్నాలజీ & ఇన్నోవేషన్ (ACITI) పార్ట్నర్షిప్ను అధికారికంగా ప్రకటించారు.
మోదీ మాట్లాడుతూ “మూడు ఖండాలు, మూడు మహాసముద్రాల్లో ఉన్న ప్రజాస్వామ్య దేశాల మధ్య ఈ కొత్త భాగస్వామ్యం ఎదుగుతున్న టెక్నాలజీలు, AI, స్వచ్ఛ ఇంధనంలో (PM Modi) సహకారాన్ని మరింత బలపరుస్తుంది” అని తెలిపారు.
ఈ భాగస్వామ్యం ద్వారా సరఫరా గొలుసుల వైవిధ్యీకరణ, క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పెద్ద అడుగులు పడనున్నాయి.
Read also: Sumit Kumar: వ్యవసాయంపై కలెక్టర్ ఫోకస్
అదే రోజున మోదీ, బ్రిటన్ ప్రధాన మంత్రి కియర్ స్టార్మర్, యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుతెర్రెస్, బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా సమావేశమయ్యారు.
స్టార్మర్తో భేటీపై మోదీ, “ఇండియా–UK సంబంధాలకు ఈ సంవత్సరం కొత్త ఊపు వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం” అని పేర్కొన్నారు.
సమ్మిట్ ప్రారంభ సెషన్లో మోదీ, ప్రపంచ అభివృద్ధి నమూనాలను మళ్లీ ఆలోచించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
అదే సమయంలో, డ్రగ్–టెర్రర్ నెక్సస్ను ఎదుర్కోవడానికి G20 స్థాయిలో ప్రత్యేక ఇనిషియేటివ్, అలాగే గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ ఏర్పాటు చేయాలని సూచించారు.
“అన్ని వర్గాలను కలుపుకునే, నిలకడైన వృద్ధి కోసం ఇప్పుడు ప్రపంచం కొత్త మార్గాలను అన్వేషించాలి. భారత ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ సిద్ధాంతం అందుకు సరైన దారి చూపిస్తుంది” అని మోదీ అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: