యంగ్ టైగర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘NTR-NEEL’ మూవీ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంబోపై ఇప్పటికే ఫ్యాన్స్కి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన తొలి షెడ్యూల్ కోసం చిత్ర బృందం రెడీ అయ్యింది. తాజాగా సముద్ర తీరంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలసి సినిమా గురించి చర్చిస్తున్న ఫొటోను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఎన్టీఆర్ మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్
ఈ ఫొటోతో పాటు “ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ఇద్దరూ సిద్ధమవుతున్నారు” అంటూ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో పాటు వచ్చిన చిత్రం ఫ్యాన్స్ను ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కలుస్తే భారతీయ సినిమా పరిశ్రమలో మరో సంచలనం ఖాయమని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.
‘డ్రాగన్’ అనే టైటిల్
ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ టైటిల్తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా సినీ ప్రేమికులందరిలోనూ భారీ ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.