జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు

Read Time:  1 min
jan26 new ration card
jan26 new ration card
FONT SIZE
GET APP

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనవరి 26, 2025 నుంచి కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందజేయబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో 200 కొత్త గ్రామపంచాయతీలు, 11 కొత్త మండలాల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అలాగే, పెండింగ్‌లో ఉన్న ములుగు మున్సిపాలిటీ ఏర్పాటుకు త్వరలోనే గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని మరింత విస్తరించిన ప్రభుత్వం, వ్యవసాయ భూములు ఉన్న రైతులతో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తామని వెల్లడించింది. ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ భూమి పరిమాణానికి సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు.

ప్రభుత్వ భూముల సేకరణ విషయంలో రైతుల భరోసా కూడా కొనసాగుతుందని, రాళ్లు, రప్పలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయమని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలతో పేద ప్రజలకు, రైతులకు ప్రభుత్వ మద్దతు మరింత బలపడుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.