ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ (Naa Anveshana) మరియు బీజేపీ నాయకురాలు, నటి కరాటే కళ్యాణి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ బ్లాక్ చేసిన నేపథ్యంలో, ఆయన యూట్యూబ్ ఛానెల్ను కూడా లక్ష్యంగా చేసుకుంటూ కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పటికే నిలిపివేయబడగా, ఇప్పుడు ఆయన ప్రధాన ఆదాయ వనరు అయిన ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ను కూడా డిలీట్ చేయించాలని కరాటే కళ్యాణి పట్టుబడుతున్నారు. అన్వేష్ తన వీడియోల ద్వారా హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను కించపరిచారని ఆమె ఆరోపిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా అకౌంట్లు మాత్రమే కాకుండా, అన్వేష్ విదేశాల్లో పర్యటించకుండా ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయాలని, అలాగే ఆయన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Viveka Murder Case : ఉదయ్ కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోండి – సునీత
ఈ వివాదానికి ప్రధాన కారణం అన్వేష్ తన ట్రావెల్ వీడియోల్లో హిందూ దేవుళ్ల గురించి లేదా ఆచారాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలేనని కరాటే కళ్యాణి వర్గం వాదిస్తోంది. అన్వేష్ విదేశాల్లో ఉంటూ ఇక్కడి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని ఆమె పేర్కొంటున్నారు. ఆయనకు కఠినమైన జైలు శిక్ష పడేలా చేస్తానని, చట్టపరంగా వెనక్కి తగ్గేదే లేదని ఆమె ఘాటుగా స్పందించారు. అన్వేష్ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనబోతున్నారు.

మరోవైపు, అన్వేష్ అభిమానులు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క భావప్రకటన స్వేచ్ఛను హరించడం సరికాదని కొందరు వాదిస్తుంటే, మతాచారాలను గౌరవించాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ యూట్యూబ్ ఛానెల్పై కూడా గూగుల్ సంస్థ చర్యలు తీసుకుంటే, అది అన్వేష్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చట్టపరంగా పాస్పోర్ట్ లేదా బ్యాంక్ అకౌంట్ల సీజ్ అనేది పోలీసు విచారణలో నిగ్గుతేలాల్సిన అంశం. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది సైబర్ క్రైమ్ పోలీసుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com