తాజాగా ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వైద్య రంగంలో చర్చనీయాంశమయ్యాయి. రోబోటిక్ సర్జరీ భవిష్యత్తులో మానవ సర్జన్లను మించి అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు.ప్రముఖ బిలియనీర్ మస్క్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో టాప్ డాక్టర్లను కూడా రోబోలు అధిగమిస్తాయని చెప్పారు.ఇప్పటికే కొన్ని రంగాల్లో రోబోటిక్ టెక్నాలజీ అద్భుతాలు చూపుతోందని మస్క్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ రంగంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.న్యూరాలింక్ అనే సంస్థను మస్క్ స్థాపించిన విషయం తెలిసిందే.

ఈ సంస్థ మెదడు కార్యకలాపాలను మెషీన్లతో కలిపే టెక్నాలజీపై పనిచేస్తోంది.ఈ సంస్థలో శస్త్రచికిత్సలు రోబోల సహాయంతో జరుగుతున్నాయంటూ మస్క్ వివరించారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ మానవుల కంటే రోబోలు చాలా మెరుగ్గా చేస్తున్నాయని చెప్పారు.ఈ వ్యాఖ్యలు మెడ్ట్రానిక్ అనే అమెరికన్ సంస్థ విజయవంతంగా చేసిన రోబోటిక్ సర్జరీలపై వచ్చిన ఓ పోస్ట్కు ప్రతిస్పందనగా వచ్చాయి.మెడ్ట్రానిక్ ‘హ్యూగో’ అనే రోబో టెక్నాలజీతో 137 సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో ప్రోస్టేట్, కిడ్నీ, బ్లాడర్ వంటి కీలక శస్త్రచికిత్సలు ఉన్నాయి.ఈ సర్జరీల సక్సెస్ రేటు 98 శాతానికి పైగా ఉండటం గమనార్హం. సమస్యలు తలెత్తిన కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి.ప్రోస్టేట్ సర్జరీలలో కేవలం 3.7 శాతం కేసుల్లోనే చిన్న సమస్యలు వచ్చాయి.
కిడ్నీ కేసుల్లో ఇది 1.9 శాతం మాత్రమే.బ్లాడర్ సంబంధిత కేసుల్లో 17.9 శాతం ఉండటం గమనించాలి.137 సర్జరీలలో కేవలం రెండు మాత్రమే సాంప్రదాయ పద్ధతికి మారాల్సి వచ్చింది. అందులో ఒకటి రోబోలో చిన్న లోపం వల్ల, మరొకటి క్లినికల్గా క్లిష్టంగా ఉండటం వల్ల అని తెలియజేశారు.ఇదిలా ఉంటే, న్యూరాలింక్ ప్రస్తుతం తన టెక్నాలజీపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. మొదటి దశలో ముగ్గురు వ్యక్తులకు బ్రెయిన్ ఇంప్లాంట్స్ విజయవంతంగా అమర్చారు.ఈ ఇంప్లాంట్స్ నరాల సమస్యలతో బాధపడే వారికి సహాయం చేస్తాయి. మెదడు ఆలోచనల ద్వారా కంప్యూటర్ను నియంత్రించే సామర్థ్యాన్ని కల్పిస్తాయి.మస్క్ అంచనా ప్రకారం, త్వరలో వందల మందికి న్యూరాలింక్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఐదేళ్లలో అది పదివేలు దాటుతుంది. పదేళ్లలో లక్షల మందికి ఈ టెక్నాలజీ చేరుతుందని తెలిపారు.
Read Also : Houthi :అమెరికా వైమానిక దాడి పై హౌతీ ఆరోపణలు