Breaking News – Lookout Notice : శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు

Read Time:  1 min
Breaking News – Lookout Notice : శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు
FONT SIZE
GET APP

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసు (Lookout notice issued against Shilpa Shetty, Raj Kundra) జారీ చేశారు. రూ. 60 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే తమ సంస్థ విస్తరణ కోసం తన వద్ద నుంచి ఈ డబ్బును తీసుకున్నారని, అయితే దానిని వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ డబ్బును తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు తీసుకున్న డబ్బును అప్పుగా చూపి, పన్ను ఆదా కోసం పెట్టుబడిగా మార్చుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఈ లుకౌట్ నోటీసుతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం విడిచి వెళ్లే అవకాశం లేదు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి నోటీసులు పంపినట్లు సమాచారం. రూ. 60 కోట్ల మోసం ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ కేసు దర్యాప్తులో ఇంకా ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://vaartha.com/we-will-target-those-countries-putin/international/542091/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.