వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ యువ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం వెల్లడించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం, పార్టీ బలాన్ని పెంచడం ఈ పాదయాత్ర లక్ష్యమని జగన్ వివరించారు.
సోషల్ మీడియా వింగ్ బలోపేతం చేయాలి
జగన్ మాట్లాడుతూ.. పార్టీ సోషల్ మీడియా వింగ్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఒక ఆయుధంలా మారిందని, ప్రభుత్వం చేపడుతున్న అన్యాయాలను, ప్రజలకీ ఎదురవుతున్న కష్టాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల గోడును ప్రక్షాళన చేసే వేదికగా సోషల్ మీడియాను వాడాలని, పార్టీ కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండాలని సూచించారు.
పాదయాత్రలో సోషల్ మీడియా యాక్టివిస్టులతో భేటీ
తాను చేపట్టబోయే పాదయాత్ర(Paadayatra)లో సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ ప్రత్యక్షంగా కలవనున్నట్లు జగన్ తెలిపారు. వారి భావాలు, సమస్యలు వినే అవకాశం కల్పించడంతోపాటు, పార్టీ పరంగా ఎలాంటి ముందడుగులు వేయాలో తెలుసుకుంటానన్నారు. గతంలో తన చేపట్టిన పాదయాత్ర ప్రజలలో విశేష స్పందనను పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మార్గంలో ముందుకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
Read Also : Dr. B.V. Pattabhiram : డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత