తెలంగాణలో పేదలకు అందుబాటులో గృహనిర్మాణ అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటి వరకూ గ్రామ ప్రాంతాల్లో మాత్రమే కొనసాగిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ కార్యక్రమాన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించుకుంది. పేదలు నివసించే ప్రాంతాల్లోనే జీ+3 మోడల్లో అపార్టుమెంట్ల తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచనలో ఉంది.
స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం
ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్వర్యంలో ఈ పనులు వేగంగా ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టణాల్లో భూముల కొరత ఉన్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అధికారులపై బాధ్యత – పూర్తి చేయని ఇళ్లను పూర్తి చేయాలి
ఇకపోతే ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలన్న దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు గృహావసరం తీరే అవకాశం ఉంది. త్వరలోనే స్థలాల ఎంపిక, నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ చర్యలు పేదల జీవితాల్లో స్థిరత్వం కలిగించేలా ఉండబోతున్నాయి.
Read Also : Bandh : తెలంగాణ లో ఈరోజు స్కూళ్లు, కాలేజీలు బంద్ – ఎస్ఎఫ్ఎ