Telangana cinema news : Bhatti Vikramarka Mallu దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, అయితే హైదరాబాద్లో మౌలిక వసతులు, స్టూడియోలు, టెక్నికల్ సపోర్ట్, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని భట్టి వివరించారు. అన్ని భాషల చిత్ర పరిశ్రమలు ఇక్కడకు వస్తే యువత, టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులకు భారీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సినీ రంగ అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తామని వెల్లడించారు.
Read also: Recruitment 2026: ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

సినీ రంగానికి గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం అవార్డులను పునరుద్ధరించిందని చెప్పారు. ప్రజల కోసం కళల ద్వారా పోరాడిన మహనీయుడు గద్దర్ పేరుతో అవార్డులు అందించడం గర్వకారణమన్నారు. వాణిజ్య విజయంతో పాటు సామాజిక సందేశం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జ్యూరీ సభ్యులకు సూచించారు.
ఈ నెల నుంచి స్క్రీనింగ్ ప్రారంభమై, ఉగాది రోజున గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: