Hyderabad : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. రోజుకో కొత్త పద్ధతిలో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాగే నగరంలోని మొహదీపట్నానికి చెందిన Hyderabad ఓ యువకుడిని టార్గెట్ చేశారు. మొదట అమ్మాయి పేరుతో ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. యువకుడు అంగీకరించడంతో చాటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా సైబర్ నేరగాళ్లు అతడిని మరింతగా చాటింగ్లోకి లాగారు.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో అమ్మాయి ఫోటోతో బాధిత యువకుడికి వీడియో కాల్ చేశారు. అతడిని నగ్న వీడియో కాల్ చేయాలని బలవంతపెట్టారు. యువకుడు అమాయకంగా అలా చేయగా, ఆ వీడియోను రికార్డు చేసుకున్నారు.
తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వెంటనే ₹1.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదిలేక యువకుడు డబ్బులు ఇచ్చాడు. అయినప్పటికీ, వారు ఇంకా ఎక్కువ డబ్బులు అడగడం ప్రారంభించారు.
ఇక భరించలేక బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.