Himachal tourism : హిమాచల్ ప్రదేశ్కు వెళ్లే పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టూరిస్టులకు స్థానిక సంస్కృతి, గ్రామీణ జీవనశైలి, సంప్రదాయ వంటకాల అనుభూతిని కల్పించేందుకు హోమ్స్టేలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రత్యేకంగా హోమ్స్టే రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు.
ఇప్పటి నుంచి హోమ్స్టే యజమానులు ఇంటి నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఫైర్ ఎన్ఓసీల పేరుతో జరుగుతున్న ఆలస్యం, వేధింపులకు చెక్ పెట్టి తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరిన్ని హోమ్స్టేలు అందుబాటులోకి రానున్నాయి.
Read also: Online: 2016ని ఆన్లైన్లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణాల్లో కూడా ఆరు గదుల వరకు హోమ్స్టేలకు అనుమతి ఇస్తున్నారు. స్థానిక వంటకాలు, సంప్రదాయ గృహ నిర్మాణ శైలి, ప్రకృతి మధ్య బస చేసే అవకాశం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. అంతేకాకుండా టూరిజం యూనిట్ల కోసం వడ్డీ రాయితీ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఈ మార్పులతో హిమాచల్ ట్రిప్ మరింత స్పెషల్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: