हिन्दी | Epaper

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

sumalatha chinthakayala
రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహిస్తున్న న్యాయస్థానం, ఈ సందర్భంగా ఉచితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

image

ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు.ఉచిత రేషన్‌,డబ్బులు అందుతుండటంతో ఎలాంటి పని చేయకుండానే ఆదాయం లభిస్తోంది.ప్రజలకు సౌకర్యాలను అందించాలనే ప్రభుత్వాల లక్ష్యం మంచిదే. కానీ,వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఉచితాల వల్ల అది జరుగుతోందా? ఎన్నికల సమయంలో ఇలాంటి ఉచిత వాగ్దానాలు ప్రకటించడం సరైన విధానం కాదు అని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఈ మిషన్ ఎంత కాలం పాటు కొనసాగుతుందో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870